అమెరికాలో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం!

ABN , First Publish Date - 2021-04-09T20:45:48+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన కామ్‌స్కోప్ సంస్థకు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన జొన్నలగడ్డ ప్రవీణ్ (45) సీఐఓ(చీఫ్

అమెరికాలో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం!

హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన కామ్‌స్కోప్ సంస్థకు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన జొన్నలగడ్డ ప్రవీణ్ (45) సీఐఓ(చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్)గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఫోర్బ్స్ మేగజైన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. సీఐఓ‌గా నియామకం కావడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన శ్రమకు తగిన గుర్తింపు లభించినట్టుగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా.. మిర్యాలగూడలోని స్థానిక పాఠశాలలోనే ప్రవీణ్ తన ప్రథమిక విద్యను పూర్తి చేశారు. అనంతరం ఎయిడెడ్ కాలేజీలో చేరి బీఎస్సీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసి.. 2001లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. దాదాపు 12ఏళ్ల క్రితం కామ్‌స్కోప్‌లో చేరిన ప్రవీణ్.. ఆ సంస్థలో డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తదితర హోదాల్లో పని చేశారు. 


Updated Date - 2021-04-09T20:45:48+05:30 IST