భైంసా బైపాస్ రోడ్లో వక్ఫ్ బోర్డు భూమి వివాదం
ABN , First Publish Date - 2022-07-06T22:45:46+05:30 IST
జిల్లాలోని భైంసా బైపాస్ రోడ్లో వక్ఫ్ బోర్డు భూమి వివాదం చోటుచేసుకుంది. సర్వే నం.162, 164, 165లో ఉన్న భూములపై హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది.
నిర్మల్: జిల్లాలోని భైంసా బైపాస్ రోడ్లో వక్ఫ్ బోర్డు భూమి వివాదం చోటుచేసుకుంది. సర్వే నం.162, 164, 165లో ఉన్న భూములపై హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అధికారుల ఆదేశాల మేరకు 40.08 ఎకరాల భూమిని స్వాధీనం కోసం బోర్డు అధికారులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని, ప్రస్తుతం పంట సాగులో ఉందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు, హక్కుదారులకు మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది.