మియాపూర్ పీఎస్ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2021-09-19T00:59:27+05:30 IST
మియాపూర్ పీఎస్ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత
హైదరాబాద్: మియాపూర్ పీఎస్ పరిధిలో 3 బ్యాగులలో అక్రమంగా తరలిస్తున్న 30 కేజీల గంజాయి పట్టుబడింది. సురేష్, కరుణాకర్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నుంచి 2 సెల్ఫోన్లు, రూ.4.50 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి గంజాయి ఎగుమతి చేసుకొని హైదరాబాద్, ముంబైకి నిందితులు సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.