స్పోర్ట్స్ శాఖ అధ్వర్యంలో 75 కిలోమీటర్స్ రన్నింగ్

ABN , First Publish Date - 2022-08-14T14:32:31+05:30 IST

స్పోర్ట్స్ శాఖ అధ్వర్యంలో 75 కిలోమీటర్స్ రన్నింగ్

స్పోర్ట్స్ శాఖ అధ్వర్యంలో 75 కిలోమీటర్స్ రన్నింగ్

హైదరాబాద్: అజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ శాఖ అధ్వర్యంలో 75 కిలోమీటర్స్ రన్నింగ్ ప్రారంభించారు. 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా 75కిలోమీటర్స్ రన్నింగ్ నిర్వహించారు. సైబరాబాద్ సీపీ ఆఫీస్ నుంచి దుర్గం చెరువు, ఉస్మానియా, చార్మినార్, గోల్కొండ మీదుగా రన్నింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరిగి మళ్లీ సీపీ ఆఫీస్‌కు రన్నింగ్ చేరుకోనుంది. తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి రన్నింగ్‌ని ప్రారంభించారు. సామ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 75 కిలోమీటర్స్ రన్నింగ్ నిర్వహించారు. 


Updated Date - 2022-08-14T14:32:31+05:30 IST