పురాతన ఇళ్లు కూల్చివేస్తుండగా ఘోరం
ABN , First Publish Date - 2022-08-14T02:24:34+05:30 IST
పురాతన ఇళ్లు కూల్చివేస్తుండగా ఘోరం
వరంగల్: జిల్లాలోని రంగసాయిపేటలో విషాదఘటన చోటుచేసుకుంది. పురాతన ఇళ్లు కూల్చివేస్తుండగా ప్రమాదవశాత్తు శిథిలాలు మీదపడి జహంగీర్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.