శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత
ABN , First Publish Date - 2022-04-26T01:25:51+05:30 IST
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా భారీగా హెరాయిన్ పట్టుబడింది. రూ.21.9 కోట్ల విలువైన 3.12 కేజీల హెరాయిన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖతర్ నుంచి వచ్చిన విమానంలో డ్రగ్స్ గుర్తించారు. నైరోబీ నుంచి దోహా మీదుగా హైదరాబాద్కు విమానం వచ్చినట్లు గుర్తించారు. బిజినెస్ వీసాపై వచ్చిన మహిళా ప్రయాణికురాలను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.