మునుగోడు ఉపఎన్నికలో పోటీ ఎవరి మధ్య?: కేటీఆర్
ABN , First Publish Date - 2022-10-04T02:47:26+05:30 IST
మునుగోడు ఉపఎన్నికలో పోటీ ఎవరి మధ్య?: కేటీఆర్
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మునుగోడు ఉపఎన్నికలో పోటీ ఎవరి మధ్య? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ను నల్లగొండ ప్రజలకు శాపంలా కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. ఫ్లోరోసిస్ నిర్మూలనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా.. మిషన్ భగీరథకు బీజేపీ పైసా ఇవ్వలేదని ట్విటర్లో వేదికగా ఆయన పేర్కొన్నారు. మిషన్భగీరథతో ఫ్లోరోసిస్ నుంచి టీఆర్ఎస్ విముక్తి చేసిందన్నారు.