ప్రజావాణి-గ్రీవెన్స్ డే తిరిగి ప్రారంభం
ABN , First Publish Date - 2022-04-25T22:21:11+05:30 IST
ప్రజావాణి-గ్రీవెన్స్ డే తిరిగి ప్రారంభం
హైదరాబాద్: జిల్లాల్లో ప్రతీ సోమవారం ప్రజావాణి-గ్రీవెన్స్ డే తిరిగి ప్రారంభం కానుంది. గ్రీవెన్స్ డే రెండేళ్లుగా ఆగిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజ్భవన్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తామని గవర్నర్ ప్రకటన చేశారు. ఇప్పటికే రాజ్భవన్ దగ్గర ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు గవర్నర్ కార్యాలయం చేసింది.