‘ప్రభుత్వ భూములతో చీకటి వ్యాపారం’
ABN , First Publish Date - 2022-07-24T22:49:15+05:30 IST
ఆర్ఎఫ్సీఎల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ అనుచరులు కోట్లు వసూళ్లు చేశారని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనే ప్రకాష్ ఆరోపించారు.
పెద్దపల్లి: ఆర్ఎఫ్సీఎల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ అనుచరులు కోట్లు వసూళ్లు చేశారని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనే ప్రకాష్ ఆరోపించారు. బాధితులకు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే వారి సీడీలు బయట పెడతానని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్ద సీసీ పుటేజీలు ఉన్నాయన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ బావ, అంతర్గాం జెడ్పీటీసీ ఆముల నారాయణ, జెన్ కో భూమిని కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. అలాగే రామగుండంలో బూడిద, ఇసుక మాఫియా నడుస్తోందన్నారు. ప్రభుత్వ భూములతో చీకటి వ్యాపారం నడిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు.