భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

ABN , First Publish Date - 2022-07-23T20:56:55+05:30 IST

భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల మంత్రులకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మరీ మాట్లాడారు.

భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

హైదరాబాద్: భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల మంత్రులకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మరీ మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కేసీఆర్‌ సూచించారు. అలాగే ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. 

Updated Date - 2022-07-23T20:56:55+05:30 IST