తెలుగు అకాడమీ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం
ABN , First Publish Date - 2021-10-04T22:35:41+05:30 IST
తెలుగు అకాడమీ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే నలుగురు నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: తెలుగు అకాడమీ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే నలుగురు నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ-1 మస్తాన్ వలీ, ఏ-3 సత్యనారాయణ, ఏ-4 పద్మావతి, ఏ-5 సయ్యద్ మోహియుద్దీన్ అరెస్టయ్యారు. చంచల్గూడ జైల్లో నలుగురు నిందితులు ఉన్నారు. నిందితులను వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ సీసీఎస్ పోలీసుల పిటిషన్ వేశారు. మరోవైపు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. రేపు కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారించనుంది. ఈ రోజు ఏ-2 రాజ్కుమార్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.