భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్
ABN , First Publish Date - 2022-06-26T22:13:50+05:30 IST
భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్
హైదరాబాద్: పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర బీజేపీ బండి సంజయ్ భూమిపూజ చేశారు. ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన ప్రారంభించారు. 10 లక్షల మందితో భారీ బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం పయ్రయత్నాలు చేస్తోంది. సభకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం కమలనాథులు చేశారు. అలాగే మోదీ సభ కోసం నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్ లను నియమించారు. బూత్ స్థాయి నుంచి సభకు కార్యకర్తలను తరలించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో భద్రతా విభాగాలు అప్రమత్తమైయ్యారు. ఆందోళనకారులు సభలో ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.