Munugodu: సోనియా అంటే గౌరవం ఉందని చెప్పినా.. నాపై కుట్ర చేస్తున్నారు: రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-14T00:01:01+05:30 IST

తెలంగాణ (Telangana)తో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) తెలిపారు.

Munugodu: సోనియా అంటే గౌరవం ఉందని చెప్పినా.. నాపై కుట్ర చేస్తున్నారు: రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ (Telangana)తో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో రాజీనామా చేసిన తర్వాతే మునుగోడుకు నిధులు విడుదల చేస్తున్నారని చెప్పారు. తన రాజీనామా తర్వాతే చేనేతలకు బీమా ప్రకటించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా అంటే గౌరవం ఉందని చెప్పినా.. తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనను టార్గెట్‌ చేస్తూ పోస్టర్లు వేస్తున్నారని తెలిపారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా జరిగేదే మునుగోడు ఉపఎన్నిక అని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టులకు అమ్ముడుపోయే వ్యక్తి ఉపఎన్నికకు ధైర్యంగా వెళ్లగలరా? అని ప్రశ్నించారు. కాలుష్యంతో చౌటుప్పల్‌ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 21న జరిగే మునుగోడు బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్‌షా పాల్గొంటారని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు.

Updated Date - 2022-08-14T00:01:01+05:30 IST