పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలం

ABN , First Publish Date - 2022-06-30T10:11:06+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై టి-హబ్‌ 2 భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన యూనికార్న్‌ స్టార్ట్‌ప్సతో ఐటీ మంత్రి

పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలం

యూనికార్న్‌ స్టార్టప్స్‌తో మంత్రి కేటీఆర్‌ వెల్లడి

పెట్టుబడులకు సర్కారు సహకారం అందిస్తుందని హామీ

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై టి-హబ్‌ 2 భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన యూనికార్న్‌ స్టార్ట్‌ప్సతో ఐటీ మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. టిహబ్‌ భవనాన్ని మంగళవారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన అనంతరం యూనికార్న్‌ స్టార్ట్‌పల వ్యవస్థాపకులను సన్మానించారు. అదే రోజు రాత్రి కేటీఆర్‌ వారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలను రూపొందించామన్నారు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ వంటి ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు ప్రారంభించాయని, ఐటీ రంగంలో ప్రపంచపటంలో నగరానికి విశిష్టస్థానం ఉందన్నారు. పెట్టుబడులకు సిద్ధమైతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. లీడ్‌ స్కూల్‌ వ్యవస్థాపకుడు సుమీత్‌ మెహతా మంత్రితో సమావేశం సందర్భంగా విద్యారంగాభివృద్ధిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. స్టార్టప్‌ సంస్కృతికి అనుగుణంగా విద్యావ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులను వివరించారు. ఈ దిశగా లీడ్‌ స్కూల్‌ చేపడుతున్న కార్యక్రమాలను మంత్రికి తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రి మెహతాను కోరారు.  

================


Updated Date - 2022-06-30T10:11:06+05:30 IST