బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-03-14T17:17:40+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు జస్టిస్ ఉజన్ బయల్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా రిజిస్టర్‌ను నేరుగా అసెంబ్లీకి వెళ్లి అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే హైదరబాద్ సీపీకి కూడా నోటీసులు అందజేయాలని న్యాయస్థానం తెలిపింది. అసెంబ్లీకి వెళ్ళే ముందు ఫోన్‌లో ముందే సమాచారం ఇవ్వాలని రిజిష్టర్‌కు సూచించింది. సాయంత్రం 4 గంటలలోపు నోటీసుల అంశంపై నివేదిక ఇవ్వాలని రిజిష్టర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2022-03-14T17:17:40+05:30 IST