భూముల విక్రయానికి తెలంగాణ హైకోర్టు పచ్చజెండా
ABN , First Publish Date - 2022-02-17T23:56:23+05:30 IST
ప్రభుత్వ భూముల విక్రయానికి తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్: ప్రభుత్వ భూముల విక్రయానికి తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. కోకాపేట్, ఖానామెట్ భూముల వేలంపై బీజేపీ నేత విజయశాంతి వేసిన పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తమ భూములను విక్రయించడాన్ని తప్పుపట్టలేమని హైకోర్టు అభిప్రాయపడింది. భూముల విక్రయంలో ప్రభుత్వం టెండర్లు, ఈవేలం వంటి పారదర్శక విధానాలను పాటించాలని హైకోర్టు సూచించింది. విజయశాంతి పిల్పై హైకోర్టు విచారణను ముగించింది.