తెలంగాణ ప్రభుత్వానికి క్రీడల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు: ఠాగూర్
ABN , First Publish Date - 2021-10-03T19:33:02+05:30 IST
తెలంగాణ ప్రభుత్వానికి క్రీడల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని శాప్ మాజీ ఛైర్మన్ రాజ్ ఠాగూర్ తప్పుబట్టారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి క్రీడల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని శాప్ మాజీ ఛైర్మన్ రాజ్ ఠాగూర్ తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్కు తలమానికమైన ఎల్బీ స్టేడియం శిథిలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కోచ్లను రెగ్యులరైజ్ చేయకుండా చాలీచాలని జీతాలు చెల్లిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి పీవీ సింధు, సానియామీర్జా మాత్రమే కనిపిస్తున్నారని విమర్శించారు. ఆర్చరీ గ్రౌండ్ను టిమ్స్కు ఎలా కేటాయిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. టిమ్స్ ఆస్పత్రికి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని రాజ్ ఠాగూర్ డిమాండ్ చేశారు.