తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 153కు పెంచాలి: వినోద్‌

ABN , First Publish Date - 2021-06-27T10:45:08+05:30 IST

జమ్మూకశ్మీర్‌ను రాష్ట్రంగా పునరుద్ధరించి శాసనసభా స్థానాలను పెంచడానికి ప్రయత్నిస్తున్న కేంద్రం తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపును పట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌ అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 153కు పెంచాలి: వినోద్‌

హైదరాబాద్‌, జూన్‌26 (ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్‌ను రాష్ట్రంగా పునరుద్ధరించి శాసనసభా స్థానాలను పెంచడానికి ప్రయత్నిస్తున్న కేంద్రం తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపును పట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌ అన్నారు. శనివారం మినిస్టర్‌ క్వార్టర్స్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలని డిమాండ్‌ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెం బ్లీ సీట్లు పెంచాలని ఇద్దరు సీఎంలు ప్రధాని మోదీని కోరితే.. రాజ్యాంగ సవరణ చేయాలన్నారని, జమ్మూకశ్మీర్‌కు ఆ నిబంధన  వర్తించదా అని ప్రశ్నించారు.

Updated Date - 2021-06-27T10:45:08+05:30 IST