ఇంగ్లండ్‌ టూర్‌కు జట్టు ఎంపిక నేడు

ABN , First Publish Date - 2021-05-07T10:14:14+05:30 IST

ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టును సెలెక్షన్‌ కమిటీ శుక్రవారం ప్రకటించనుంది.

ఇంగ్లండ్‌ టూర్‌కు జట్టు ఎంపిక నేడు

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టును సెలెక్షన్‌ కమిటీ శుక్రవారం  ప్రకటించనుంది. జూన్‌ 18 నుంచి 22 వరకు జరిగే టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌.. అనంతరం ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 14 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీ్‌స జరగనుంది. ఈ రెండు సిరీస్‌లకు 30 మందితో జంబో జట్టును ఎంపిక చేసే అవకాశమున్నట్టు సమాచారం. ఐపీఎల్‌లో సత్తా చాటిన పృథ్వీ షా పునరాగమనం చేసే చాన్సుంది. అదనంగా మరో ఓపెనర్‌ను ఎంపిక చేయనున్న నేపథ్యంలో.. అభిమన్యు ఈశ్వరన్‌, ప్రియాంక్‌ పాంచల్‌, దేవదత్‌ పడిక్కళ్‌ ఈ స్థానానికి పోటీపడనున్నారు. అలాగే మూడో కీపర్‌ స్థానానికి ఇషాన్‌ కిషన్‌, ఆంధ్ర ఆటగాడు కోన భరత్‌ మధ్య పోటీ ఏర్పడనుంది. రిస్ట్‌ స్పిన్నర్‌ పోటీలో అక్షర్‌, రాహుల్‌ చాహర్‌లలో ఎవరు విజేతలవుతారో చూడాలి. అలాగే గాయంనుంచి కోలుకున్న మరో తెలుగు ఆటగాడు హనుమ విహారి కూడా జట్టులోకి రానున్నాడు. 

Updated Date - 2021-05-07T10:14:14+05:30 IST