రూ. 1733 కోట్ల బ్రాండ్ విలువ
ABN , First Publish Date - 2021-02-05T09:02:13+05:30 IST
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా నాలుగో సంవత్సరమూ అత్యంత విలువైన సెలెబ్రిటీలలో అగ్రస్థానంలో నిలిచాడు.
నాలుగో ఏడాదీ కోహ్లీయే టాప్
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా నాలుగో సంవత్సరమూ అత్యంత విలువైన సెలెబ్రిటీలలో అగ్రస్థానంలో నిలిచాడు. మొత్తం రూ. 1733 కోట్ల బ్రాండ్ విలువతో విరాట్ 2020 సంవత్సరంలోనూ తన టాప్ స్థానం నిలబెట్టుకున్నాడు. డఫ్, ఫెల్ప్స్ సంస్థ ప్రకటించిన ఈ జాబితాలో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, రన్వీర్ సింగ్కు వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కాయి. టాప్-10లో సినిమా యేతర రంగం నుంచి కోహ్లీ ఒక్కడే ఉన్నాడు. ఇక తొమ్మిది మంది సినీ స్టార్లలో ఇద్దరు నటీమణులు దీపికా పదుకోన్ (5వ), ఆలియా భట్(6వ)కు చోటు లభించింది. గత ఏడాది కొవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ కోహ్లీ బ్రాండ్ విలువ చెక్కు చెదరకపోవడం విశేషం.