ఉపాధ్యాయురాలి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-16T16:30:21+05:30 IST

తిరుచ్చి జిల్లా దురైయూరుకు చెందిన గుణశేఖరన్‌ భార్య లిల్లీ (32) ఉప్పిలియాపురం(Uppiliyapuram) సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో

ఉపాధ్యాయురాలి ఆత్మహత్య

అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 15: తిరుచ్చి జిల్లా దురైయూరుకు చెందిన గుణశేఖరన్‌ భార్య లిల్లీ (32) ఉప్పిలియాపురం(Uppiliyapuram) సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు వివాహమై 12 యేళ్లయినా సంతానం లేదు. ఈ క్రమంలో ఈ పాఠశాలలో పనిచేసే మోహన్‌దాస్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించగా, అతనికి లిల్లి అండగా ఉన్నట్టు బాధిత విద్యార్థులు ఆరోపిస్తూ, లిల్లీపై ముసిరి ఆల్‌ఉమెన్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లిల్లీ ఇంట్లో  ఆత్మహత్యకు పాల్పడగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-09-16T16:30:21+05:30 IST