TDP వర్గీయుడిపై వైసీపీ శ్రేణుల హత్యాయత్నం

ABN , First Publish Date - 2022-06-03T20:01:45+05:30 IST

జిల్లాలోని దుర్గి మండలం జంగమేశ్వరపాడులో టీడీపీ వర్గీయుడుని హత్య చేసేందుకు వైసీపీ శ్రేణులు యత్నించారు.

TDP వర్గీయుడిపై వైసీపీ శ్రేణుల హత్యాయత్నం

పల్నాడు: జిల్లాలోని దుర్గి  మండలం జంగమేశ్వరపాడులో టీడీపీ వర్గీయుడుని హత్య చేసేందుకు వైసీపీ శ్రేణులు యత్నించారు. కంచర్ల జల్లయ్య(35) అనే వ్యక్తిపై వైసీపీ శ్రేణులు వేట కొడవళ్లతో దాడి చేశారు. వైసీపీ దాడిలో జల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక జల్లయ్య గ్రామం వదిలి వెళ్లిపోయాడు. మూడేళ్లుగా మాడుగుల గ్రామంలో ఉంటున్నాడు. అయితే ఈ రోజు గ్రామంలోకి వచ్చిన టీడీపీ వర్గీయుడిపై వైసీపీ కార్యకర్తలు కాపు కాచి దాడి చేశారు. జల్లయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. 

Updated Date - 2022-06-03T20:01:45+05:30 IST