TDP VS YSRCP : అవినీతిపరులెవరో కాణిపాకంలో తేల్చుకుందాం రండి!
ABN , First Publish Date - 2021-08-24T12:41:26+05:30 IST
అవినీతిపరులు టీడీపీ నేతలా.. వైసీపీ నేతలా ఎవరనేది కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసి తేల్చుకుందాం రండని..
చిత్తూరు జిల్లా/గంగాధరనెల్లూరు : అవినీతిపరులు టీడీపీ నేతలా.. వైసీపీ నేతలా ఎవరనేది కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసి తేల్చుకుందాం రండని జిల్లా వైసీపీ ప్రధానకార్యదర్శి కోదండన్, మండల వైసీపీ కన్వీనర్ సురేంద్రరెడ్డి, వైసీపీ లీగల్సెల్ ప్రధానకార్యదర్శి హరిబాబు సవాల్ విసిరారు. గంగాధరనెల్లూరులో సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి అవినీతికి పాల్పడి ఉంటే ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆయన్ని ఎందుకు గెలిపించారో తెలుసుకోవాలని హితవుపలికారు. సమావేశంలో వరత్తూరు సర్పంచ్ నరసింహులు, వింజం మాజీ సర్పంచ్ గోవిందయ్య, బాలగంగనపల్లె మాజీ ఎంపీటీసీ గోవిందన్, నేతలు వెంకటేష్రెడ్డి, కుట్టి, డేవిడ్, ఆబూ, మణిగండన్, గిరిబాబు పాల్గొన్నారు.