టీడీపీ సీనియర్ నేత కాగిత వెంకట్రావు మృతి

ABN , First Publish Date - 2021-04-29T20:22:55+05:30 IST

టీడీపీ సీనియర్ నేత కాగిత వెంకట్రావు (71) కన్నుమూశారు. కృష్ణాజిల్లాకి చెందిన వెంకట్రావు, టీడీపీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.

టీడీపీ సీనియర్ నేత కాగిత వెంకట్రావు మృతి

విజయవాడ: టీడీపీ సీనియర్ నేత కాగిత వెంకట్రావు (71) కన్నుమూశారు. కృష్ణాజిల్లాకి చెందిన వెంకట్రావు, టీడీపీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. గత రెండు రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయనను మచిలీపట్నం నుండి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ హార్ట్ ఎటాక్ రావడంతో గురువారం మృతి చెందారు. సాయంత్రం మూడు గంటలకు ఆయన స్వగ్రామమైన నాగేశ్వరరావు పేటకు భౌతిక కాయాన్ని తీసుకెళ్తారు. పెడన నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా పలు దఫాలు పనిచేశారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌‌గా, టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా  కూడా గతంలో ఆయన పనిచేశారు. కాగిత వెంకట్రావు కుమారుడు కృష్ణ ప్రసాద్ రాజకీయాల్లో ఉండగా, కుమార్తె వైద్య రంగంలో సేవలు అందిస్తున్నారు. వెంకట్రావు మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, విద్యావేత్తలు సంతాపం తెలియజేశారు.

Updated Date - 2021-04-29T20:22:55+05:30 IST