పోలవరంపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది: సజ్జల
ABN , First Publish Date - 2022-04-21T23:19:53+05:30 IST
పోలవరంపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు.
అమరావతి: పోలవరంపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం జాప్యానికి మాజీ సీఎం చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలే కారణమని విమర్శించారు. చంద్రబాబు నోరు అదుపులోపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కిందిస్థాయి అధికారులు చేసిన తప్పుకు మొత్తం ప్రభుత్వాన్నే ఎలా తప్పుబడతారు? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.