టీడీపీ ఆఫీసులో సాక్షిపేపర్ను తగులబెట్టిన జీవీ
ABN , First Publish Date - 2020-02-16T19:25:46+05:30 IST
టీడీపీ ఆఫీసులో ‘సాక్షి’పేపర్ను టీడీపీ నేత జీవీ ఆంజనేయులు తగులబెట్టారు.
గుంటూరు : టీడీపీ ఆఫీసులో ‘సాక్షి’పేపర్ను టీడీపీ నేత జీవీ ఆంజనేయులు తగులబెట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఐటీ దాడులపేరుతో టీడీపీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచ్చలేని టీడీపీ అధినేత చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తే సహించమని చెప్పుకొచ్చారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. వైసీపీ సొంత మీడియాపై పరువునష్టం దావా వేస్తామని జీవీ తెలిపారు.