బాధితులే.. నిందితులను గుర్తించాలా..?: నారా లోకేష్

ABN , First Publish Date - 2021-09-15T02:12:11+05:30 IST

విజయవాడ: మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో

బాధితులే.. నిందితులను గుర్తించాలా..?: నారా లోకేష్

విజయవాడ: మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్.. అత్యాచారాంధ్రప్రదేశ్‌గా మారిందన్నారు. ఆడబిడ్డల్ని బయటకి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొందని చెప్పారు.


విశాఖ జిల్లాలో తండ్రీకొడుకులు కలిసి.. బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందన్నారు. బాధితులే నిందితులను గుర్తించాలని మహిళా హోంమంత్రి మాట్లాడడం.. వారి అసమర్థతకు నిదర్శనమని తెలిపారు.  కనీసం ఒక్క ఘటనలో కూడా నిందితులకు శిక్షలు పడకపోవడం వల్లే.. కామోన్మాదులు రెచ్చిపోతున్నారని చెప్పారు. వైసీపీ నేతల ఫ్యాక్షన్ పాలిటిక్స్ కోసం పోలీసుల్ని వాడుకోవడం మానేస్తే, కనీసం వారు నిందితులనైనా పట్టుకుంటారని లోకేష్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-09-15T02:12:11+05:30 IST