ప్రజలు బలైపోతున్నారు.. దందా చేయడం మానండి: లోకేశ్
ABN , First Publish Date - 2020-08-03T20:57:12+05:30 IST
జగన్ ధనదాహానికి ప్రజలు బలైపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అమరావతి: జగన్ ధనదాహానికి ప్రజలు బలైపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన.. ప్రకాశంలో 20 మంది, కడపలో ముగ్గురు నాటు సారా, శానిటైజర్ తాగి మృతి చెందటం బాధాకరమన్నారు. ఇవన్నీ సర్కారు హత్యలేనని ఆరోపించారు. జే టాక్స్ వసూళ్ల కోసం లోపభూయిష్టమైన మద్యం పాలసీ తీసుకొచ్చారని, చెత్త బ్రాండ్లు తెచ్చి ప్రజల రక్తాన్ని తాగుతూ 25 వేల కోట్లు దండుకుంటున్నారన్నారు. నాటు సారా ఏరులై పారుతోందన్నారు. జే బ్రాండ్లు తాగిన వాళ్ళు ఆసుపత్రికి చేరుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి మద్యనిషేధం పేరుతో దందా చెయ్యడం మాని ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు.