చంద్రబాబు మార్క్ ఉండకూడదనే వైసీపీ కుట్ర: ఎమ్మెల్సీ రామకృష్ణ
ABN , First Publish Date - 2020-05-30T14:04:32+05:30 IST
చంద్రబాబు మార్క్ ఉండకూడదనే వైసీపీ కుట్ర: ఎమ్మెల్సీ రామకృష్ణ
అమరావతి: చంద్రబాబు మార్క్ ఉండకూడదనే అమరావతిని మార్చాలని వైసీపీ కుట్ర చేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ విమర్శించారు. ఏబీఎన్ డిబేట్లో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి ప్రజావేదికను కూల్చారని మండిపడ్డారు. వైసీపీ మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడాలేని నిర్ణయమని దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీ కాదు, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలోనే పోలవరం 70 శాతం పూర్తయిందని తెలిపారు. వైసీపీ వచ్చి ఏడాదైనా పోలవరం ఏ పనీ జరగడం లేదని రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.