వైసీపీ మహిళా మంత్రులపై Angara Rammohan తీవ్ర విమర్శలు
ABN , First Publish Date - 2022-06-11T18:39:17+05:30 IST
వైసీపీ మహిళా మంత్రులపై టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
అమరావతి: వైసీపీ మహిళా మంత్రులపై టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్(Angara rammohan) తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ సర్కార్లో మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాల పట్ల మంత్రి రోజా తేలికగా మాట్లాడుతున్నారన్నారు. మంత్రి రోజా.. తాను ఇంకా జబర్దస్త్ షోలోనే ఉన్నాననుకుంటున్నారని అన్నారు. తల్లుల పెంపకంలో లోపమే కారణమని హోంమంత్రి అంటున్నారని... అంటే మహిళలపై అఘాయిత్యాలకు వారి తల్లులే కారణమా? అని ప్రశ్నించారు. మంత్రులు ముందు వారి శాఖలపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ హితవుపలికారు.