ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది: ఎమ్మెల్యే నిమ్మల
ABN , First Publish Date - 2022-02-17T00:21:29+05:30 IST
రైతులకు ఎరువులను అందించకుండ ప్రభుత్వం మొద్దు
పశ్చిమ గోదావరి: రైతులకు ఎరువులను అందించకుండ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. జిల్లాలో యూరియా కొరతపై పాలకొల్లులో రైతు భరోసా కేంద్రాలు, ఎరువుల షాపులను ఎమ్మెల్యే నిమ్మల తనిఖీ చేశారు. యూరియా బస్తాకు అదనంగా రూ.200 రైతులు చెల్లిస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందన్నారు. చంద్రబాబు హయాంలో పుష్కలంగా దొరికిన యూరియా ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో మాత్రమే దొరుకుతోందని ఆయన విమర్శించారు.