జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసిన టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2021-08-24T23:34:28+05:30 IST
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను టీడీపీ నేతలు మంగళవారం కలిశారు.
అమరావతి: జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను టీడీపీ నేతలు మంగళవారం కలిశారు. రమ్య హత్య ఘటన, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల వివరాలను ఎస్సీ కమిషన్ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై జరిగిన దాడులకు సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్కు ఒక బుక్లెట్ అందించామని తెలిపారు. తాము ఇచ్చిన ఆధారాలను ఎస్సీ కమిషన్ పరిశీలించిందన్నారు. త్వరలో ఢిల్లీ పిలుస్తామన్నారన్నారు. అవసరం అయితే ప్రతి కేసులో డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ కోరతామని చెప్పారని వర్ల రామయ్య తెలిపారు.
అనంతరం మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. తాము ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని ఎస్సీ కమిషన్ సభ్యులు హామీ ఇచ్చారన్నారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో దళితులే టార్గెట్గా దాడులు చేశారని చెప్పామన్నారు. డాక్టర్ సుధాకర్ని పిచ్చి వాడిగా చేసి ఆయన మరణానికి ప్రభుత్వమే కారణం అయిందని జాతీయ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని నక్కా ఆనంద్ బాబు చెప్పారు.
గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్తున్నారనగానే మా దగ్గరికి వైసీపీ నేతలను పంపిస్తున్నారని చెప్పారు. ఏపీలో ఒక భయానక వాతావరణాన్ని ప్రభుత్వమే సృష్టింస్తోందని మండిపడ్డారు. కేస్ బై కేస్ విచారిస్తామని ఎస్సీ కమిషన్ సభ్యులు హామీ ఇచ్చారని శ్రవణ్ కుమార్ తెలిపారు.