జడ్జిలకు కులాలు, మతాలను అపాదించొద్దు: గొట్టిపాటి
ABN , First Publish Date - 2020-05-27T00:13:16+05:30 IST
కోర్టు తీర్పులపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవచ్చని టీడీపీ లీగల్ ఇన్ఛార్జ్ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ అన్నారు. న్యాయమూర్తులకు..
అమరావతి: కోర్టు తీర్పులపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవచ్చని టీడీపీ లీగల్ ఇన్ఛార్జ్ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ అన్నారు. న్యాయమూర్తులకు కులాలు, మతాలను అంటగట్టొద్దన్నారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడొద్దని సూచించారు. న్యాయవ్యవస్థ నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ఎంపీగా ఉన్న నందిగం సురేష్ న్యాయవ్యవస్థను అవమానించడం బాధాకరమని, ఎంపీ పదవిలో ఉండటానికి నందిగం సురేష్ అనర్హుడన్నారు. అధికారులు రాజకీయనాయకులకు తాబేదార్లుగా వ్యవహరిస్తున్నారని గొట్టిపాటి వ్యాఖ్యానించారు.