YSRCP కి TDP సవాల్.. అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయగలరా!?

ABN , First Publish Date - 2021-08-25T12:22:51+05:30 IST

అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయగలరా!?

YSRCP కి TDP సవాల్.. అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయగలరా!?

చిత్తూరు జిల్లా/గంగాధరనెల్లూరు : వైసీపీ నాయకులు తాము అవినీతికి పాల్పడడం లేదని కాణిపాకంలో ప్రమాణం చేయగలరా.. అని మండల టీడీపీ అధ్యక్షుడు దేవసుందరం, మాజీ మండల అధ్యక్షుడు సుబ్రాయులునాయుడు, మాజీ మార్కెట్‌ కమిటీ డెరెక్టర్లు ప్రకా‌ష్‌నాయుడు, స్వామిదా‌స్ సవాల్‌ విసిరారు. మంగళవారం వారు గంగాధరనెల్లూరులో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో కొందరు వైసీపీ నేతలు ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణా ద్వారా రూ.కోట్లు దండుకున్నారని, డిప్యూటీ సీఎం బంధువులు, అనుచరులు టీటీడీ దర్శన టికెట్లు అమ్ముకుని జేబులు నింపుకొంటున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందన్నారు. 


వైసీపీ నాయకుల అక్రమాల గురించి రెండేళ్ళలోనే  నియోజకవర్గ ప్రజలందరికీ   తెలిసిందన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ నాయకుల పేర్లతో కాణిపాకంలో ప్రమాణం చేయడానికి తాము సిద్ధమని, తాము అవినీతికి పాల్పడలేదని వైసీపీ నాయకులు ప్రమాణం చేయగలరా.. అని వారు సవాల్‌ విసిరారు. కాణిపాకానికి ఎప్పుడు వస్తారో తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ప్రసాద్‌నాయుడు,  బాబురెడ్డి, జగన్నాథరెడ్డి, మాధవరెడ్డి, మునిరత్నంనాయుడు, లోకనాథం, జాన్‌, చిరంజీవి, షణ్ముగం, శాంతకుమార్‌, కండిగ శంకర్‌, సంపత్‌, మునస్వామి, పట్టాభి, రాజేంద్ర, స్వామినాథన్‌, ఉలగనాథం, పదకుమార్‌, గోపి, స్టాన్లీ, ప్రకాష్‌ పాల్గొన్నారు.



Updated Date - 2021-08-25T12:22:51+05:30 IST