కేంద్రాన్ని, ప్రజలను వైసీపీ సర్కార్ తప్పుదోవ పట్టిస్తోంది: Yanamala

ABN , First Publish Date - 2022-06-14T18:08:06+05:30 IST

రాష్ట్రంలో వాస్తవ ఆర్థిక పరిస్థితిని మరుగుపెట్టి తప్పుడు లెక్కలతో అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని

కేంద్రాన్ని, ప్రజలను వైసీపీ సర్కార్ తప్పుదోవ పట్టిస్తోంది: Yanamala

అమరావతి: రాష్ట్రంలో వాస్తవ ఆర్థిక పరిస్థితిని మరుగుపెట్టి తప్పుడు లెక్కలతో అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర రెవెన్యూ రాబడులతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అధికవడ్డీలకు అప్పులు తెస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలోని పరిస్థితి చూసి పెట్టుబడులు పెట్టడానికి, అప్పులివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఇష్టానుసారంగా బదిలీ చేసి ప్రజా ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆయన మండిపడ్డారు.


కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని  ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు చెల్లించకపోవడంతో రైల్వే పనులు నిలిచిపోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రుణాలు, ఉపయోగిస్తున్న నిధులపై కేంద్ర ప్రభుత్వం, నీతిఆయోగ్‌, రిజర్వ్ బ్యాంక్‌తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను బహిర్గతం చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-14T18:08:06+05:30 IST