Lokesh: జగన్ ఇసుక మాఫియా అమాయకుల్ని బలి తీసుకుంటోంది
ABN , First Publish Date - 2022-08-19T15:23:35+05:30 IST
జగన్ రెడ్డి ఇసుక మాఫియా అమాయకుల్ని బలి తీసుకుంటోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
అమరావతి: జగన్ రెడ్డి (Jagan mohan reddy) ఇసుక మాఫియా అమాయకుల్ని బలి తీసుకుంటోందని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) విమర్శించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడ్డారని దళిత యువకుడు వరప్రసాద్కు వైసీపీ ప్రభుత్వం శిరోముండనం చేసిందన్నారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఎల్లపల్లెలో ఇసుక అక్రమ రవాణాని ప్రశ్నించి అడ్డుకున్నందుకే యువకుడు కిషన్ను ఇసుక మాఫియా హత్య చేసిందని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి కిషన్ను హత్య చేసిన ఇసుక మాఫియా, దాని వెనుక ఉన్న వైసీపీ నేతల (YCP Leaders)పై కఠిన చర్యలు తీసుకోవాలని.. కిషన్ కుటుంబాన్ని ఆదుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.