ప్రధానిని జగన్ ఆదర్శంగా తీసుకోవాలి: Jawahar

ABN , First Publish Date - 2021-11-19T17:48:50+05:30 IST

ప్రధాని మోడీని ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ అన్నారు.

ప్రధానిని జగన్ ఆదర్శంగా తీసుకోవాలి: Jawahar

అమరావతి: ప్రధాని మోడీని ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ అన్నారు. ప్రతిష్టకు పోకుండా రైతుల త్యాగాలను పరిగణలోకి తీసుకోవాలని, అమరావతే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇన్సైడర్‌తో కొన్నాళ్ళు, సామాజిక వర్గ రాజధాని అని కొన్నాళ్ళు కాలయాపన చేసింది చాలన్నారు. రైతుల పోరాటమే కాదు... త్యాగాన్ని గుర్తించాలని హితవుపలికారు. దళిత రాజధాని అమరావతిని కొనసాగించాలని జవహర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-19T17:48:50+05:30 IST