స్వార్థప్రయోజనాల కోసం పోలవరాన్ని తాకట్టు: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2022-03-05T16:39:14+05:30 IST

స్వార్థప్రయోజనాల కోసం పోలవరాన్ని తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు

స్వార్థప్రయోజనాల కోసం పోలవరాన్ని తాకట్టు: దేవినేని ఉమా

విజయవాడ: స్వార్థప్రయోజనాల కోసం పోలవరాన్ని తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. సీబీఐ, ఈడీ, బాబాయి హత్య కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ రాజీపడి కేంద్రం ముందు నోరెత్తలేదని విమర్శించారు. నిర్వాసితులను ద్రోహంచేసే హక్కు సీఎం జగన్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రివర్స్ డ్రామా ఆడకుండా ఉంటే ఈపాటికి పోలవరం పూర్తయ్యేదన్నారు. పునరావాసం కింద దాదాపు లక్ష కుటుంబాలకు కట్టాల్సిన ఇళ్లపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి పర్యటనలో రూ.47,725కోట్లు ఇస్తే చాలని రాజీపడటంలో పిరికితనం ఏంటి అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం ఏం మాట్లాడతారు, కేంద్రమంత్రి ఏం చెప్తారని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తుంటే మంత్రులు కార్ పార్కింగ్ గొడవకి పరిమితమయ్యారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-03-05T16:39:14+05:30 IST