రైతులు చేసిన ఉద్యమం ఏపీ మరిచిపోదు: Devineni uma

ABN , First Publish Date - 2022-03-04T18:12:24+05:30 IST

808 రోజులుగా రాజధాని రైతులు చేసిన ఉద్యమం రాష్ట్రం మరచిపోదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు.

రైతులు చేసిన ఉద్యమం ఏపీ మరిచిపోదు: Devineni uma

అమరావతి: రాజధాని అమరావతి కోసం 808 రోజులుగా రాజధాని రైతులు చేసిన ఉద్యమాన్ని రాష్ట్రం మరచిపోదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... స్వాతంత్ర్య ఉద్యమం తరవాత ఆ స్థాయిలో ఉద్యమం చేశారన్నారు. సీఆర్డీఏ చట్టం అమరావతి ప్రజా రాజధానిని కాపాడిందని అన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే వెంటనే స్పందించాలని... ఈ రాష్ట్రానికి ఫైనాన్స్ గుమస్తా సీఎం కాకూడదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే డెవలప్మెంట్ చేసి అప్పగించాలని డిమాండ్ చేశారు. పక్కరాష్ట్రం నుండి తెచ్చుకున్న లాలూచీ నిధులతో అమరావతిని చంపారని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రికి పరిపాలన చేయడం చేతకాదు...అందుకే చతికిల పడ్డారన్నారు.  రైతు చట్టాలపై ప్రధాని దేశానికి క్షమాపణ చెప్పారని... ఈ సీఎం ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. లాఠీలతో కొట్టిన పోలీసులకు అన్నం పెట్టిన చేతులు రైతులవని... ఇక బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని రైతులు ముందుకు వెళ్ళాలని దేవినేని ఉమా అన్నారు. 

Updated Date - 2022-03-04T18:12:24+05:30 IST