అక్రమ క్వారీయింగ్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?: Devineni uma
ABN , First Publish Date - 2022-02-10T16:14:53+05:30 IST
గుంటూరు జిల్లా సుద్ధపల్లిలో అక్రమ క్వారీయింగ్పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు.
అమరావతి: గుంటూరు జిల్లా సుద్ధపల్లిలో అక్రమ క్వారీయింగ్పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు. కోట్లాది రూపాయల అక్రమ దోపిడిని ప్రశ్నిస్తూ ధూళిపాళ్ల నరేంద్ర చేపట్టిన దీక్ష తాడేపల్లి రాజప్రసాదానికి కనబడడం లేదా? అని నిలదీశారు. ‘‘మీ నేతల దోపిడీపై టీడీపీ నేతల పోరును అక్రమ కేసులు, హౌస్ అరెస్టులతో ఆపలేరు’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.