జగన్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరుకుంది: Devathoti
ABN , First Publish Date - 2022-07-15T14:31:55+05:30 IST
సీఎం జగన్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరుకుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.
అమరావతి: సీఎం జగన్ రెడ్డి(Jagan reddy) పిచ్చి పరాకాష్టకు చేరుకుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు (Devathoti nagaraju) అన్నారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరును మార్చి... జగనన్న విదేశీ విద్య పేరును పెట్టుకోవడం ఆయనలోని పైశాచికత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరును మార్చడం.. అంబేద్కర్తో పాటు దళితులను అవమానించడమే అవుతుందన్నారు. దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం జగన్ రెడ్డికి, వైసీపీ నాయకులకు పదేపదే అలవాటుగా మారిందని దేవతోటి నాగరాజు విరుచుకుపడ్డారు.