విజయసాయి రెడ్డి చర్చలకు పిలవడం హాస్యాస్పదం: దేవతోటి

ABN , First Publish Date - 2022-06-11T14:15:25+05:30 IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు విమర్శలు గుప్పించారు.

విజయసాయి రెడ్డి చర్చలకు పిలవడం హాస్యాస్పదం: దేవతోటి

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasaireddy)పై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు(Devathoti nagaraju) విమర్శలు గుప్పించారు. ‘‘సూట్ కేస్ కంపెనీల సృష్టి కర్త, అవినీతి సొమ్ముకు గుత్తెదారు విజయసాయి రెడ్డి చర్చలకు పిలవడం హాస్యాస్పదం. విజయ సాయి రెడ్డి సవాల్ విసిరడ౦... పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. ఎవరు ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో  వారికే అర్థం కావడం లేదు’’ అంటూ దేవతోటి నాగరాజు వ్యాఖ్యలు చేశారు. 


Updated Date - 2022-06-11T14:15:25+05:30 IST