మంత్రివర్గ కూర్పు హాస్యాస్పద చర్య: Devathoti

ABN , First Publish Date - 2022-04-12T14:24:12+05:30 IST

జగన్ రెడ్డి కొత్త మంత్రివర్గం కూర్పు ఒక హాస్యాస్పదమైన చర్య అని టీడీపీ నేత దేవతోటి నాగరాజు వ్యాఖ్యానించారు.

మంత్రివర్గ కూర్పు హాస్యాస్పద చర్య: Devathoti

అమరావతి: జగన్ రెడ్డి కొత్త మంత్రివర్గం కూర్పు ఒక హాస్యాస్పదమైన చర్య అని టీడీపీ నేత దేవతోటి నాగరాజు వ్యాఖ్యానించారు. ఎవరికి ఏ మంత్రి పదవి ఇచ్చినా అధికారం మాత్రం సజ్జల చేతుల్లోనే ఉంటుందన్నారు. మంత్రివర్గ కూర్పు ఒక ప్రహాసన ప్రక్రియ అని... దళితులకు ప్రత్యేకించి ఒరిగిందేమీ లేదని అన్నారు. బానిసలా ఉండే దళితులకే మంత్రి పదవులు వస్తున్నాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మేధావులు కూడా బహిరంగంగా ప్రకటిస్తున్నారని దేవతోటి నాగరాజు హెచ్చరించారు. 

Updated Date - 2022-04-12T14:24:12+05:30 IST