గుండ్లపాడుకు బయలుదేరిన Chandrababu
ABN , First Publish Date - 2022-01-13T19:02:11+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడుకు బయలుదేరి వెళ్లారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడుకు బయలుదేరి వెళ్లారు. గుండ్లపాడులో హత్యకు గురైన టీడీపీ నేత చంద్రయ్య కుటుంబాన్ని చంద్రబాబు కలిసి పరామర్శించనున్నారు. కాగా... చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకుంటారేమోనని టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీడీపీ అధినేతతో పాటు దేవినేని ఉమా, దూళిపాళ్ల నరేంద్ర, ఇతర నేతలు గుండ్లపాడుకు బయలుదేరారు.