మరోసారి ముంచేసిన విజయసాయి: బుద్దా ట్వీట్

ABN , First Publish Date - 2020-02-16T17:29:27+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంటి సోదాలకు సంబంధించిన

మరోసారి ముంచేసిన విజయసాయి: బుద్దా ట్వీట్

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంటి సోదాలకు సంబంధించిన ఐటీ పంచనామా నివేదికపై ఆ పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన రాజ్యసభ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన విద్యతో మరోసారి వైసీపీని ముంచేశాడని వ్యాఖ్యానించారు. ఐటీ పంచనామా రిపోర్టుతో 2 వేల కోట్ల రూపాయలు అంటూ వైసీపీ నేతలు ఆడిన డ్రామాలు, సాక్షి సిత్రాలు పటాపంచలు అయ్యాయని కౌంటర్ ఇచ్చారు. అక్కడ ఉన్నది కేవలం 2 లక్షల 63 వేల రూపాయలు, 12 తులాల బంగారం మాత్రమేనని.. అవి కూడా తమకొద్దని ఐటీ అధికారులు తిరిగి ఇచ్చేశారని బుద్దా పేర్కొన్నారు. 


ఇదిలా ఉంటే.. వాటి పక్కన నాలుగు సున్నాలు పెడితే పోలా అని జగన్ ఆదేశించడం.. సున్నాలు పెట్టడంలో నిష్ణాతుడైన విజయసాయి రెడ్డి నాలుగు సున్నాలు తగిలించడం చేశారని విమర్శించారు. 2 వేల కోట్లు అంటూ మొరిగి మరోసారి వైసీపీ దొంగల ముఠాని విజయసాయి ముంచేశారని బుద్దా ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.



Updated Date - 2020-02-16T17:29:27+05:30 IST