బ్రాహ్మణులను వైసీపీ సర్కార్ దారుణంగా మోసం చేసింది: Bonda uma

ABN , First Publish Date - 2022-03-02T17:44:53+05:30 IST

బ్రాహ్మణ సమాజికవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా వ్యాఖ్యలు చేశారు.

బ్రాహ్మణులను వైసీపీ సర్కార్ దారుణంగా మోసం చేసింది: Bonda uma

అమరావతి: బ్రాహ్మణ సమాజికవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభత్వంలో బ్రాహ్మణులకు స్వర్ణ యుగమన్నారు. వైసీపీ గత 3 సంవత్సరాలుగా ఒక్క రూపాయి నిధులు మంజరు చేయలేదని తెలిపారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణ విద్యార్ధులకు స్కాలర్షిప్‌లు, ఫించన్‌లు, అనేక పథకాలు వచ్చేవని గుర్తుచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్‌ను మూసివేసే దిశగా పాలన ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణులకు అండగా టీడీపీ పోరాటం చేస్తుందని బోండో ఉమా స్పష్టం చేశారు. 

Updated Date - 2022-03-02T17:44:53+05:30 IST