బొజ్జలకు ప్రముఖుల నివాళి
ABN , First Publish Date - 2022-05-19T08:35:19+05:30 IST
ఇటీవల కన్నుమూసిన టీడీపీ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కర్మక్రియలు ఆయన స్వగ్రామమైన శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో బుధవారం జరిగాయి. రెం
శ్రీకాళహస్తి, మే 18: ఇటీవల కన్నుమూసిన టీడీపీ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కర్మక్రియలు ఆయన స్వగ్రామమైన శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో బుధవారం జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ నేతలు వచ్చి బొజ్జలకు నివాళులర్పించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, అమరనాథరెడ్డి, కన్నబాబు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, హేమలత, దామలచెరువు జనార్దన్, కురుగొండ్ల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మాజీ ఎంపీ వైస్రా య్ ప్రభాకర్రెడ్డి, బీజేపీ నాయకులు సత్యకుమార్, భానుప్రకా్షరెడ్డి, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి తదితరులు నివాళులర్పించారు.
బొజ్జల తమ్ముడి హఠాన్మరణం.. కర్మక్రియల రోజే మరో విషాదం
మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇంట్లో మరో విషా దం చోటు చేసుకుంది. ఇటీవల మరణించిన బొజ్జలకి బుధవా రం కర్మక్రియలు జరిగాయి. అయితే, ఇదే రోజు రాత్రి 9 గంటలకు బొజ్జల తమ్ముడు హరినాధరెడ్డి బాత్రూమ్లో కాలుజారి పడడంతో గుండెపోటుకు గుర య్యారు. అరగంట దాటినా బాత్రూమ్ నుంచి బయట కు రాకపోవడంతో కుటుంబీకులు లోపలికి వెళ్లి చూడగా స్పృహ తప్పిపడివున్న హరినాథరెడ్డి కనిపించారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఊరందూరుకు తరలించారు.