డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ

ABN , First Publish Date - 2022-02-23T00:08:03+05:30 IST

డీజీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ముమ్మిడివరం

డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ

అమరావతి: డీజీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ముమ్మిడివరం మండలంలోని అయినాపురంలో వైసీపీ నేతల వేధింపులు తాళలేక విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన పేర్కొన్నారు. నిబద్దత కలిగిన పోలీసుగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వైసీపీ శ్రేణుల అరాచకాలు పెచ్చుమీరాయన్నారు. సామాన్యుల ధన, మాన ప్రాణాలకు రక్షణ కరువైందన్నారు. ప్రశ్నిస్తే దాడులు, ఎదురిస్తే బెదిరింపులు, ఆస్తుల ధ్వంసాలు జరుగుతున్నాయన్నారు.  తూర్పు గోదావరిలో విశ్రాంత ఉద్యోగి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై వేధించారన్నారు. ఉద్దేశ్య పూర్వకంగానే బెనిఫిట్స్ అందకుండా జాప్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జాప్యం వెనుక వైసీపీ నాయకుల ఒత్తిడి ఉందంటూ వాంగ్మూలం ఇచ్చాడన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఆయన కోరారు. 

Updated Date - 2022-02-23T00:08:03+05:30 IST