బడ్జెట్‌లో వైసీపీ ఏం సాధించింది?: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2022-02-02T00:30:44+05:30 IST

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి వైసీపీ ఏం సాధించిందని

బడ్జెట్‌లో వైసీపీ ఏం సాధించింది?: అచ్చెన్నాయుడు

అమరావతి: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి వైసీపీ ఏం సాధించిందని టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.  28 మంది ఎంపీలుండి వైసీపీ ఏం చేశారని ఆయన నిలదీశారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టారని ఆయన ఆరోపించారు. వైసీపీ ఎంపీల చేతకానితనంతోనే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి ఎదురైందన్నారు. సవరించిన పోలవరం అంచనాలను కేంద్రం ఆమోదించకపోవడం వైసీపీ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. 

Updated Date - 2022-02-02T00:30:44+05:30 IST