టీడీపీ ప్రతిపక్షంగా వైఫల్యం చెందింది: తమ్మినేని

ABN , First Publish Date - 2022-01-12T20:38:50+05:30 IST

టీడీపీ ప్రతిపక్షంగా వైఫల్యం చెందిందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

టీడీపీ ప్రతిపక్షంగా వైఫల్యం చెందింది: తమ్మినేని

శ్రీకాకుళం: టీడీపీ ప్రతిపక్షంగా వైఫల్యం చెందిందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని తెలిపారు. ఓటీఎస్‌పై ప్రజలను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే పట్టాలిస్తామంటున్న టీడీపీ నేతలు.. అధికారంలో ఉండగా ఏం చేశారు? అని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. గతంలో కూడా చంద్రబాబు ప్రజల విశ్వాసం కొల్పోయారని స్పీకర్ విమర్శించారు. చంద్రబాబు, సీఎం జగన్ ప్రభుత్వాల మద్య అభివృద్ది, సంక్షేమంలో వ్యత్యాసం గూర్చి మరోసారి మాటాడతానని తెలిపారు. అధికారంలోకి వస్తే ఓటీఎస్ ప్రీ చేస్తామంటున్నారని, ఇంత వరకూ నిద్రపోయారా అని ప్రశ్నించారు. నాడు వాగ్ధానాలు ఇచ్చి మర్చిపోయారని తమ్మినేని దుయ్యబట్టిన విషయం తెలిసిందే.


Updated Date - 2022-01-12T20:38:50+05:30 IST